యూ.ఏ.ఈ:10 శాతం మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి నమోదు
- May 24, 2020దుబాయ్:కరోనా వైరస్ భయంతో ప్రపంచదేశాల నుంచి భారత్ కు తిరిగొస్తున్న ప్రవాసీయుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. యూఏఈ నుంచి ముందుగా అంచనా వేసిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో ప్రవాస భారతీయులు స్వదేశానికి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.మంగళవారం నుంచి మూడో దశ స్వదేశానికి తిరిగి రప్పించే ప్రక్రియలో భారత్ మరిన్ని విమానాలను చేర్చనుంది.యూఏలోని మొత్తం ప్రవాసీయుల్లో దాదాపు 10 శాతం మంది భారత్ చేపట్టిన వందే భారత్ మిషన్ ద్వారా స్వదేశానికి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ విపుల్ వెల్లడించారు. ప్రయాణికుల సంఖ్య పెరగటంతో మూడో దశలో తరలింపు సమయంలో విమానాల సంఖ్యను పెంచనున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం యూఏఈలో 3.5 మిలియన్ల ప్రవాసభారతీయులు ఉంటే..స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు 3.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే..ఇందులో కొద్ది మంది వివిధ కారణాలతో రెండో ఆలోచనలో ఉన్నట్లు కాన్సులేట్ జనరల్ కార్యాలయం తెలిపింది. తాము దాదాపు 500 మందికి ప్రయాణ ఏర్పాట్లు చేస్తే..చివరి నిమిషంలో కొద్దిమంది ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారు. కొందరు ప్రయాణఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకుంటున్నారు. మరికొందరు పెయిడ్ క్వారంటైన్ కు ఇష్టపడటం లేదు. అందుకే ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. ఏదిఏమైనా యూఏఈ నుంచి ఇప్పటివరకు 6000 మందిని స్వదేశానికి తరలించినట్లు దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ విపుల్ తెలిపారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం