108 ఖైదీలకు క్షమాబిక్ష పెట్టిన షార్జా రూలర్
- May 24, 2020షార్జా:ఈద్-అల్-ఫితర్ పండుగను పురస్కరించుకుని షార్జా సర్కార్ 108 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. ఈ మేరకు సుప్రీం కౌన్సిల్ మెంబర్, షార్జా రూలర్ షేక్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి ఆదేశాలు జారీ చేశారు. వివిధ దేశాలకు చెందిన 108 మంది ఖైదీలను ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా విడిచిపెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. షార్జా పోలీసు కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ సైఫ్ అల్ జారి అల్ షంసీ... షార్జా రూలర్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఖైదీల పట్ల రూలర్ మానవీయ దృక్పథంతో ఆలోచించి క్షమాభిక్ష పెట్టడం మంచి పరిణామం అని షంసీ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్