108 ఖైదీలకు క్షమాబిక్ష పెట్టిన షార్జా రూలర్
- May 24, 2020
షార్జా:ఈద్-అల్-ఫితర్ పండుగను పురస్కరించుకుని షార్జా సర్కార్ 108 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. ఈ మేరకు సుప్రీం కౌన్సిల్ మెంబర్, షార్జా రూలర్ షేక్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి ఆదేశాలు జారీ చేశారు. వివిధ దేశాలకు చెందిన 108 మంది ఖైదీలను ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా విడిచిపెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. షార్జా పోలీసు కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ సైఫ్ అల్ జారి అల్ షంసీ... షార్జా రూలర్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఖైదీల పట్ల రూలర్ మానవీయ దృక్పథంతో ఆలోచించి క్షమాభిక్ష పెట్టడం మంచి పరిణామం అని షంసీ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







