యూ.ఏ.ఈ:10 శాతం మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి నమోదు
- May 24, 2020దుబాయ్:కరోనా వైరస్ భయంతో ప్రపంచదేశాల నుంచి భారత్ కు తిరిగొస్తున్న ప్రవాసీయుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. యూఏఈ నుంచి ముందుగా అంచనా వేసిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో ప్రవాస భారతీయులు స్వదేశానికి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.మంగళవారం నుంచి మూడో దశ స్వదేశానికి తిరిగి రప్పించే ప్రక్రియలో భారత్ మరిన్ని విమానాలను చేర్చనుంది.యూఏలోని మొత్తం ప్రవాసీయుల్లో దాదాపు 10 శాతం మంది భారత్ చేపట్టిన వందే భారత్ మిషన్ ద్వారా స్వదేశానికి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ విపుల్ వెల్లడించారు. ప్రయాణికుల సంఖ్య పెరగటంతో మూడో దశలో తరలింపు సమయంలో విమానాల సంఖ్యను పెంచనున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం యూఏఈలో 3.5 మిలియన్ల ప్రవాసభారతీయులు ఉంటే..స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు 3.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే..ఇందులో కొద్ది మంది వివిధ కారణాలతో రెండో ఆలోచనలో ఉన్నట్లు కాన్సులేట్ జనరల్ కార్యాలయం తెలిపింది. తాము దాదాపు 500 మందికి ప్రయాణ ఏర్పాట్లు చేస్తే..చివరి నిమిషంలో కొద్దిమంది ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారు. కొందరు ప్రయాణఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకుంటున్నారు. మరికొందరు పెయిడ్ క్వారంటైన్ కు ఇష్టపడటం లేదు. అందుకే ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. ఏదిఏమైనా యూఏఈ నుంచి ఇప్పటివరకు 6000 మందిని స్వదేశానికి తరలించినట్లు దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ విపుల్ తెలిపారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన