హెచ్చరిక: యూఏఈ నుంచి ఇండియాకి చార్టెడ్‌ విమానాల్లేవ్‌

- May 25, 2020 , by Maagulf
హెచ్చరిక: యూఏఈ నుంచి ఇండియాకి చార్టెడ్‌ విమానాల్లేవ్‌

దుబాయ్‌:దుబాయ్‌లోని ఇండియన్‌ కాన్సులేట్‌ జనరల్‌, ఇండియన్‌ నేషనల్స్‌ని ఉద్దేశించి ఓ హెచ్చరిక ప్రకటన చేసింది. ఇండియాకి చార్టెడ్‌ విమానాలంటూ కొందరు మోసగాళ్ళు టిక్కెట్లను అమ్మేస్తున్నారని, అలాంటివారి మాయలో పడొద్దని ప్రకటనలో హెచ్చరించింది కాన్సులేట్‌. కొందరు వ్యక్తులు, కొన్ని ట్రావెల్‌ ఏజెన్సీలు యూఏఈలోని భారతీయులను సంప్రదించి, చార్టెడ్‌ విమానాల్లో భారతదేశానికి పంపిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందనీ, అలాంటి అవకాశమేదీ ప్రస్తుతానికి లేదని కాన్సులేట్‌ తేల్చి చెప్పింది. ఇలాంటి మోసాలకు సంబంధించి భారతీయులు అప్రమత్తంగా వుండాలనీ, ఏవైనా అనుమానాలుంటే భారత కాన్సులేట్‌ని సంప్రదించాలని కాన్సులేట్‌ జనరల్‌ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com