వందే భారత్ మిషన్ కు భారీ షాక్..రద్దైన 92 ఎయిరిండియా విమానాలు
- May 27, 2020
మే-25న ఢిల్లీ నుంచి లుధియానా వరకు ఎయిర్ లైన్స్ ఎయిర్ విమానంలో ప్రయాణించిన ఓ ప్యాసింజర్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఎయిరిండియా ఇవాళ(మే-27,2020) తెలిపింది. దీంతో ఐదుగురు విమాన సిబ్బందితో సహా విమానంలో ప్రయాణించిన 41మంది క్వారంటైన్ అయినట్లు తెలిపింది. ఎయిరిండియాలో భాగమైన ఎయిర్ లైన్స్ ఎయిర్ ప్రాంతీయ విమానాలను నడుపుతుంది.
మరోవైపు మే-25న 6E 381 విమానంలో చెన్నై-కోయంబత్తూరుకి ప్రయాణించిన ఓ ప్యాసింజర్ కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఇండిగో తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ వల్ల దాదాపు రెండు నెలల పాటు ఎనేలపైనే ఉండిపోయిన దేశీయ విమానాలు సోమవారం(మే-25,2020) నుంచి గాల్లోకి ఎగిరిన విషయం తెలిసిందే. మరోవైపు, ఈ సమయంలో విమాన ప్రయాణికులకు ఎయిరిండియా షాకింగ్ న్యూస్ చెప్పింది. పలు మార్గాల్లో విమానాలను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. కరోనా వైరస్ కారణంగా పరిమిత కార్యకలాపాలు, క్వారంటైన్ నిబంధనల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. మే 28-31తేదీల్లో నడవాల్సిన 92 విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. దీంతో పాటు ప్రధాన విమానాశ్రయాల్లో స్లాట్లు అందుబాటులో లేవని ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు.
రద్దు అయిన విమానాల్లో హైదరాబాద్-బెంగళూరు,ఢిల్లీ-హైదరాబాద్, ఢిల్లీ-కోల్ కతా, చెన్నై-ఢిల్లీ, కోల్కతా-గౌహతి, చెన్నై-బెంగళూరు, చెన్నై-ముంబై, ముంబై-భోపాల్, కోల్కతా-దిబ్రుగర్, కోల్ కతా-అగర్తలా, ముంబై-ఢిల్లీ, ముంబై-అహ్మదాబాద్ తదితర మార్గాల మధ్య నడిచేవి ఉన్నాయి. రద్దయిన విమాన ప్రయాణాలకు సంబంధించి టికెట్లను ఇప్పటికే కొనుగోలు చేసినవారు 2020 ఆగస్టు 24 వరకు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అందుబాటులో ఉన్న విమానాల్లో బుక్ చేసుకునేందుకు ఎయిరిండియా అనుమతినిచ్చింది. రూటు మార్చుకునేందుకు అనుమతి ఉంటుందని, ఛార్జీల్లో వ్యత్యాసం తప్ప, దీనికి సంబంధించిన చార్జీలను రద్దు చేసినట్టు తెలిపింది.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







