1500 ప్రవాసీయులపై వేటుకు రంగం సిద్ధం చేసిన కువైట్ ఎయిర్ వేస్
- May 28, 2020కువైటైజేషన్ లో భాగంగా కువైట్ ఎయిర్ వేస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థకు చెందిన 6000 వేల మంది ఉద్యోగుల్లో 1500 మంది ప్రవాసీయులను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు కువైట్ ఎయిర్ వేస్ సీఈవో ఓ కమిటీని కూడా నియమించారు. ఇందులో సంస్థలోని కీలక విభాగాల్లోని ఉన్నతాధికారులు, ఉద్యోగుల సంఘం నేతలు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ సీఈవో నిర్ణయం ప్రకారం ప్రవాసీయుల సంఖ్యను తగ్గించే దిశగా కసరత్తు చేయనుంది. డిపార్ట్మెంట్ ల వారీగా ప్రవాసీయుల సంఖ్య...ఆయా విభాగాల్లో ఎంత మేరకు వారి అవసరం ఉందో గుర్తించి ఎవరెవర్ని తొలగించాలనేది కమిటీ జాబితా రూపొందించనుంది. అయితే..కువైటిస్, గల్ఫ్ సిటిజన్స్, కువైట్ మహిళలను పెళ్లాడిన వారిపై వేటు ఉండదని కూడా సంస్థ అధికార వర్గాలు తెలిపాయి. అలాగే 60 ఏళ్లు దాటిన కువైట్ సిటిజన్ల సేవలను కూడా ముగించాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశాయి. కువైటైజేషన్ ప్రణాళిక అమలులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా వెల్లడించాయి. మరోవైపు కరోనా సంక్షోభం తర్వాతి పరిస్థితుల్ని ఎదుర్కొవటం కూడా ఉద్యోగుల తొలగింపునకు మరో కారణంగా కనిపిస్తోంది. కరోనా కారణంగా మధ్యప్రాశ్చ దేశాల్లో 1.2 మిలియన్ల ఉద్యోగులపై ప్రభావం ఉండనుందని ఓ అంచనా.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు