1500 ప్రవాసీయులపై వేటుకు రంగం సిద్ధం చేసిన కువైట్ ఎయిర్ వేస్
- May 28, 2020కువైటైజేషన్ లో భాగంగా కువైట్ ఎయిర్ వేస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థకు చెందిన 6000 వేల మంది ఉద్యోగుల్లో 1500 మంది ప్రవాసీయులను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు కువైట్ ఎయిర్ వేస్ సీఈవో ఓ కమిటీని కూడా నియమించారు. ఇందులో సంస్థలోని కీలక విభాగాల్లోని ఉన్నతాధికారులు, ఉద్యోగుల సంఘం నేతలు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ సీఈవో నిర్ణయం ప్రకారం ప్రవాసీయుల సంఖ్యను తగ్గించే దిశగా కసరత్తు చేయనుంది. డిపార్ట్మెంట్ ల వారీగా ప్రవాసీయుల సంఖ్య...ఆయా విభాగాల్లో ఎంత మేరకు వారి అవసరం ఉందో గుర్తించి ఎవరెవర్ని తొలగించాలనేది కమిటీ జాబితా రూపొందించనుంది. అయితే..కువైటిస్, గల్ఫ్ సిటిజన్స్, కువైట్ మహిళలను పెళ్లాడిన వారిపై వేటు ఉండదని కూడా సంస్థ అధికార వర్గాలు తెలిపాయి. అలాగే 60 ఏళ్లు దాటిన కువైట్ సిటిజన్ల సేవలను కూడా ముగించాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశాయి. కువైటైజేషన్ ప్రణాళిక అమలులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా వెల్లడించాయి. మరోవైపు కరోనా సంక్షోభం తర్వాతి పరిస్థితుల్ని ఎదుర్కొవటం కూడా ఉద్యోగుల తొలగింపునకు మరో కారణంగా కనిపిస్తోంది. కరోనా కారణంగా మధ్యప్రాశ్చ దేశాల్లో 1.2 మిలియన్ల ఉద్యోగులపై ప్రభావం ఉండనుందని ఓ అంచనా.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..