సూర్య, కార్తీ మల్టీ స్టారర్ చిత్రం..!
- May 29, 2020
ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాలకి మంచి క్రేజ్ ఉంది. ఇద్దరు హీరోలు ఒకే తెరపై కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. అదే ఆ ఇద్దరు హీరోలు ఒకే ఫ్యామిలీకి చెందిన స్టార్స్ అయితే ఇక బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో ఇలాంటి ప్రయత్నాలు చేసేందుకు కసరత్తులు జరుగుతుండగా, తాజాగా సూర్య,కార్తీ కాంబినేషన్లో సినిమా రెడీ అయినట్టు తెలుస్తుంది.
పృథ్వీ -బిజూ మీనన్ కాంబినేషన్ లో ఇటీవలే వచ్చిన మలయాళ సినిమా 'అయ్యప్పనుమ్ కోశియుమ్'. అక్కడ మంచి విజయం సాధించిన ఈ సినిమానే తమిళ్లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ప్రముఖ నిర్మాత కథిరెన్. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ రీమేక్ లోనే సూర్య, కార్తీ నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ వార్తలు కనుక నిజం అయితే అభిమానులకి కనుల పండుగే అని చెప్పవచ్చు. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. కాగా, ఇటీవల సూర్య సతీమణి జ్యోతిక, కార్తీ కలిసి తంబీ అనే తమిళ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







