సూర్య, కార్తీ మల్టీ స్టారర్ చిత్రం..!
- May 29, 2020ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాలకి మంచి క్రేజ్ ఉంది. ఇద్దరు హీరోలు ఒకే తెరపై కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. అదే ఆ ఇద్దరు హీరోలు ఒకే ఫ్యామిలీకి చెందిన స్టార్స్ అయితే ఇక బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో ఇలాంటి ప్రయత్నాలు చేసేందుకు కసరత్తులు జరుగుతుండగా, తాజాగా సూర్య,కార్తీ కాంబినేషన్లో సినిమా రెడీ అయినట్టు తెలుస్తుంది.
పృథ్వీ -బిజూ మీనన్ కాంబినేషన్ లో ఇటీవలే వచ్చిన మలయాళ సినిమా 'అయ్యప్పనుమ్ కోశియుమ్'. అక్కడ మంచి విజయం సాధించిన ఈ సినిమానే తమిళ్లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ప్రముఖ నిర్మాత కథిరెన్. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ రీమేక్ లోనే సూర్య, కార్తీ నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ వార్తలు కనుక నిజం అయితే అభిమానులకి కనుల పండుగే అని చెప్పవచ్చు. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. కాగా, ఇటీవల సూర్య సతీమణి జ్యోతిక, కార్తీ కలిసి తంబీ అనే తమిళ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!