9మంది వైద్యుల కాల్చివేత...
- May 29, 2020
సోమాలియా:అనారోగ్యంతో బాధపడే ఎంతో మందికి ఆపదలో దేవుడిలా చికిత్స అందించే వైద్యుల ప్రాణాలను కూడా ఉగ్రవాదులు కడతేర్చుతున్నారు. తాజాగా సోమాలియాలో జరిగిన ఓ సంఘటన కలకలం రేపుతోంది. అల్ఖైదా అనుబంధ సంస్థ అయిన అల్ షబాబ్ గ్రూప్కు చెందిన ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. సౌత్ సోమాలియాకు చెందిన ఈ ఉగ్రవాదులు.. తొమ్మిది మంది డాక్టర్లను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత వారిని కాల్చి చంపేశారు. దేశంలోని మిడిల్ షాబెల్లీ ప్రావిన్స్ ప్రాంతంలోని బలాద్ నగరంలో ఈ తొమ్మిది మంది డాక్టర్ల డెడ్ బాడీస్ దర్శనమిచ్చాయి. వీరంతా యువ డాక్టర్లని గుర్తించారు. స్థానిక ఆస్పత్రుల్లో వీరంతా ఉద్యోగం చేసేవారని అధికారులు తెలిపారు.స్థానిక ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







