ఛత్తీస్గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి కన్నుమూత
- May 29, 2020
ఛత్తీస్గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి(74) కన్నుమూశారు. ఈ విషయాన్ని అజిత్ తనయుడు అమిత్ జోగి ట్విటర్లో వెల్లడించారు. గత కొన్నాళ్లుగా రాయ్పూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. 1946 ఏప్రిల్ 29న బిలాస్పూర్లో జన్మించిన అజిత్.. భోపాల్ మౌలానా అజాద్ కాలేజ్ విద్యనభ్యసించారు. 2000-2003 మధ్య కాలంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతకుముందు 1981-85 మధ్య భోపాల్ జిల్లా కలెక్టర్గానూ సేవలందించారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన 1986-98 మధ్య కాలంలో రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. 1998, 2004లో లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి 2016లో జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ పార్టీని స్థాపించారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







