ఛత్తీస్గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి కన్నుమూత
- May 29, 2020
ఛత్తీస్గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి(74) కన్నుమూశారు. ఈ విషయాన్ని అజిత్ తనయుడు అమిత్ జోగి ట్విటర్లో వెల్లడించారు. గత కొన్నాళ్లుగా రాయ్పూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. 1946 ఏప్రిల్ 29న బిలాస్పూర్లో జన్మించిన అజిత్.. భోపాల్ మౌలానా అజాద్ కాలేజ్ విద్యనభ్యసించారు. 2000-2003 మధ్య కాలంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతకుముందు 1981-85 మధ్య భోపాల్ జిల్లా కలెక్టర్గానూ సేవలందించారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన 1986-98 మధ్య కాలంలో రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. 1998, 2004లో లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి 2016లో జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ పార్టీని స్థాపించారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







