ఛత్తీస్గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి కన్నుమూత
- May 29, 2020
ఛత్తీస్గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి(74) కన్నుమూశారు. ఈ విషయాన్ని అజిత్ తనయుడు అమిత్ జోగి ట్విటర్లో వెల్లడించారు. గత కొన్నాళ్లుగా రాయ్పూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. 1946 ఏప్రిల్ 29న బిలాస్పూర్లో జన్మించిన అజిత్.. భోపాల్ మౌలానా అజాద్ కాలేజ్ విద్యనభ్యసించారు. 2000-2003 మధ్య కాలంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతకుముందు 1981-85 మధ్య భోపాల్ జిల్లా కలెక్టర్గానూ సేవలందించారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన 1986-98 మధ్య కాలంలో రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. 1998, 2004లో లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి 2016లో జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ పార్టీని స్థాపించారు.
తాజా వార్తలు
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి







