లాక్‌డౌన్‌ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర వస్తువులు

- May 29, 2020 , by Maagulf
లాక్‌డౌన్‌ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర వస్తువులు

కువైట్‌ గవర్నమెంట్‌, లాక్‌డౌన్‌ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేయాలని నిర్ణయించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రభుత్వం, ఫర్వానియా, ఖైతాన్‌, హవాలీ, నౌక్రా మరియు మైదాన్‌ హవాలీ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ని ప్రకటించిన విషయం విదితమే. ఈ ప్రాంతాల్లో ఫుడ్‌, హెల్త్‌ కేర్‌, గ్యాస్‌ సిలెండర్స్‌ వంటివి అందుబాటులో వుండేలా చూడనుంది ప్రభుత్వం. ఈ మేరకు క్యాబినెట్‌ ఓ నిర్ణయం తీసుకున్నట్లు అధికార ప్రతినిది¸ తారెక్‌ అల్‌ మజ్రెవ్‌ు చెప్పారు. కాగా, ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మహ్‌బౌలా మరియు జిలీబ్‌ అల్‌ షుయోక్‌ ప్రాంతాల్లోనూ లాక్‌డౌన్‌ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com