హైదరాబాద్ లో గుడిసెల్లో పేలిన గ్యాస్ సిలిండర్లు
- May 29, 2020
హైదరాబాద్ లోని బోయిన్ పల్లిలో వలస కూలీలు వేసుకున్న గుడిసెల్లోని ఓ గుడిసెలో ఈరోజు మధ్యాహ్నం గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో పేద కూలీల గుడిసెలు మొత్తం తగలబడ్డాయి. దీంతో మరో సిలిండర్ కూడా పేలింది. అసలే ఎండలు, దానికితోడు తీవ్రమైన వడగాలి ప్రభావానికి మంటలు చెలరేగాయి. రెండు సిలిండర్లు పేలిన సమయంలో గుడిసెలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. అపార్ట్మెంట్ల మధ్య ఉన్న గుడిసెలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?