కోవిడ్-19:సౌదీ అరేబియా లో మసీదులు పునఃప్రారంభం
- May 31, 2020రియాద్: సౌదీ అరేబియాలో దాదాపు 2 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మసీదులు పునఃప్రారంభమయ్యాయి. కరోనా కేసులు పెరిగిపోవడంతో సౌదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. అయితే, ఇటీవల కేసుల సంఖ్య కొంచెం తగ్గుముఖం పట్టడంతో సడలింపులు ఇస్తున్నది.అందులో భాగంగానే ఇటీవల జూన్ 21న కర్ఫ్యూ గడువు ముగిసేలోపు మక్కా మినహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో మూడు దశల్లో ఆంక్షలు ఎత్తివేస్తామని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ఇవాళ మసీదుల్లో ప్రార్థనలపై నిషేధాన్ని ఎత్తివేసింది.
అయితే, మసీదుల్లో ప్రార్థనలకు వెళ్లేవారికి సౌదీ సర్కారు కొన్ని నిబంధనలు విధించింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ముఖాలకు మాస్కులు ధరించాలని, ప్రార్థనల కోసం ఎవరి మ్యాట్ను వారే తెచ్చుకోవాలని సూచించింది. అదేవిధంగా ఒకరికి ఒకరు కనీసం రెండు మీటర్ల దూరం కచ్చితంగా పాటించాలని సూచించింది. ఒకరికి ఒకరు ఎట్టి పరిస్థితుల్లో షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోరాదని ఆదేశించింది. ఎవరైన ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు