2021 వేసవి నాటికి పూర్తి సామర్థ్యానికి చేరుకోనున్న ఎయిర్ ట్రావెల్
- June 01, 2020
దుబాయ్:ఎమిరేట్స్ ఎయిర్లైన్ ప్రెసిడెంట్ సర్ టిమ్ క్లార్క్ మాట్లాడుతూ, కరోనా వైరస్ నేపథ్యంలో ఎయిర్ ట్రావెల్ దారుణంగా దెబ్బతిందనీ, అది మునుపటి స్థాయికి రావాలంటే కొంత సమయం పడుతుందనీ, 2021 సమ్మర్ నాటికి పరిస్థితి పూర్వ స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని అన్నారు. కరోనా వైరస్కి వ్యాక్సిన్ కనుగొనేవరకూ ఎయిర్ ట్రావెల్ రంగం పుంజుకోవడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. జీతాల్లో కోత సహా అనేక సమస్యల నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, ఈ నేపథ్యంలో ఇదివరకటి స్థాయిలో ప్రజలు ఖర్చు చేసే అవకాశాలు ఇప్పట్లో వుండకపోవచ్చని టిమ్ క్లార్క్ అభిప్రాయం వెలిబుచ్చారు. కోవిడ్-19కి ముందున్న నెట్వర్క్ని అందుకోవడానికి ఎమిరేట్స్ ఎయిర్లైన్ మూడు నాలుగేళ్ళ సమయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారాయన.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







