కోవిడ్-19 పై పోరాటం: యూఏఈ చేరుకోనున్న 172 మంది నర్సులు
- June 02, 2020
దుబాయ్: బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రత్యేక ‘ఫ్లై దుబాయ్’ విమానం లో 172 మంది నర్సులను దుబాయ్ కు తీసుకురానున్నారు. వీరంతా కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలోని ఆస్టర్ డిఎం హెల్త్కేర్ ఆసుపత్రుల నుండి ఎంపిక చేయబడినవారు. వీరందరిని మొదటి రెండు వారాల పాటు నిర్బంధంలో ఉంచిన తరువాత వారిని వివిధ ఆసుపత్రులకు కేటాయించనున్నారు.
ఈ వైద్య బృందం యూఏఈ కి ప్రయాణించటానికి MEA (విదేశాంగ మంత్రిత్వ శాఖ) తమ అనుమతి ఇవ్వడంతోపాటు అన్ని లాంఛనాలు పూర్తిచేసుకొని నేడు బయలుదేరుటకు సిద్ధంగా ఉంది అని ఇండియా లోని యూఏఈ రాయబార కార్యాలయం తెలిపింది.
దుబాయ్ హెల్త్ అథారిటీ డైరెక్టర్ జనరల్ హుమైద్ అల్ కుతామి మాట్లాడుతూ, " ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. సమాజానికి సేవ చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ఫ్రంట్లైన్ కార్మికులకు మా కృతజ్ఞతలు" అని అన్నారు.
కాగా, కరోనావైరస్ పై పోరాటంలో తమవంతు సాయం అందించేందుకు మే నెలలో 88 మంది వైద్యులు మరియు నర్సులను యూఏఈ కి రావటం జరిగింది. అంతేకాకుండా, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి భారతదేశం ఇంతకుముందు 15 మంది గల వైద్య బృందాన్ని కువైట్ కు పంపిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







