ఏపీలో కొత్త 115 కరోనా పాజిటివ్ కేసులు...

- June 02, 2020 , by Maagulf
ఏపీలో కొత్త 115 కరోనా పాజిటివ్ కేసులు...

అమరావతి:ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.గడచిన 24 గంటల్లో 12,613 మంది నమూనాలు పరీక్షించగా 115 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.వీటిలో పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 33 ఉండగా.. రాష్ట్రంలో 82 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. . దీంతో రాష్ట్రంలో మొత్తం 3200 కరోనా కేసులు నమోదయ్యాయి.  40 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా 2209 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 927 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం మీద ఇప్పటి వరకు కరోనా కారణంగా 64 మంది మరణించారు.  

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com