తెలంగాణలో 7 కరోనా మరణాలు

- June 03, 2020 , by Maagulf
తెలంగాణలో 7 కరోనా మరణాలు

హైదరాబాద్:తెలంగాణలో కొత్తగా 129 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3020 కి చేరింది. తాజా కేసుల్లో GHMC పరిధిలో 108, రంగారెడ్డి, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో 6 చొప్పున, మేడ్చల్‌ 2, సిరిసిల్ల 2, యాదాద్రి, మహబూబ్‌ నగర్‌, కామారెడ్డి జిల్లాల్లో ఒకటి చొప్పున నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో వైరస్‌ బాధితుల్లో ఏడుగురు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 99కి చేరింది. తాజాగా మరో 92 మంది కోలుకున్నారు.దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1556 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1365 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com