యూ.ఏ.ఈ:లిమిటెడ్ విమానాలతో ఎయిర్ పోర్టుల పునఃప్రారంభం
- June 04, 2020
యూ.ఏ.ఈ:లిమిటెడ్ విమానాలతో విమానాశ్రయాల్ని నిర్వహించేందుకు యూఏఈ అనుమతులు జారీ చేసింది. ఎతిహాద్, ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్, ఎయిర్ అరేబియా సంస్థలకు ఈ అనుమతులు జారీ అయ్యాయి. అబుధాబి, దుబాయ్ మరియు షార్జా విమానాశ్రయాలకు ఈ సంస్థలు సేవలు అందిస్తాయని నేషనల్ క్రౌసిస్ అండ్ ఎమర్జన్సీ మేనేజ్మెంట్ అథారిటీ అధికార ప్రతినిది¸ డాక్టర్ సైఫ్ అల్ దహెరి చెప్పారు. దుబాయ్ సివిల్ ఏవియేషన్ ప్రెసిడెంట్, ఎమిరేట్స్ గ్రూప్ ఛైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్, ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రస్తుతం కేవలం ట్రాన్సిట్ మరియు ప్రత్యేక విమానాలు మాత్రమే నడుస్తున్నాయి ఆయా విమానాశ్రయాల నుంచి. కరోనా వైరస్ నేపథ్యంలో, అన్ని విభాగాలూ అప్రమత్తంగా వున్నాయనీ, సంబంధిత ప్రోటోకాల్స్కి అనుగుణంగా అన్ని వ్యవహారాలూ నడుస్తాయని అధికార యంత్రాంగం పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన