ప్రముఖ నగరాల్ని కనెక్ట్‌ చేసేలా ట్రాన్సిట్‌ విమానాల్ని ఆఫర్‌ చేస్తున్న ఎతిహాద్

- June 05, 2020 , by Maagulf
ప్రముఖ నగరాల్ని కనెక్ట్‌ చేసేలా ట్రాన్సిట్‌ విమానాల్ని ఆఫర్‌ చేస్తున్న ఎతిహాద్

‌అబుధాబి:ఎతిహాద్‌ ఎయిర్‌ వేస్‌, యూరోప్‌ అలాగే ఆసియా, ఆస్ట్రేలియాలను అబుధాబి మీదుగా కనెక్ట్‌ చేసేలా మొత్తం 20 నగరాలకు ట్రాన్సిట్‌ విమానాల్ని ఆఫర్‌ చేయనుంది. జూన్‌ 10 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. ఈ మేరకు ఎయిర్‌లైన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎతిహాద్‌ ఇటీవలే మెల్‌బోర్న్‌ మరియు సిడ్నీ నుంచి లండన్‌ హీత్రూకి లింక్‌ని ఇటీవల ప్రారంభించింది. అబుదాబీ మీదుగా వీటికి కనెక్షన్‌ వుంటుంది. ఇదివరకే ప్రకటించిన డెస్టినేషన్స్‌కి అబుధాబి నుంచి జూన్‌ అంతటా విమానాలు నడపనున్నట్లు ఎతిహాద్‌ ఇప్పటికే ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తమ సేవలు అందిస్తున్నట్లు ఈ సందర్భంగా ఎతిహాద్‌ స్పష్టం చేసింది. కోనా వైరస్‌ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com