సోనూసూద్ ఔదార్యం పై వ్వంగ్యాస్త్రాలు సంధించిన శివసేన
- June 07, 2020
లాక్డౌన్ సమయంలో వందలాది వలస కార్మికులను సొంత ప్రాంతాలకు తరలించి.. యావత్ భారత్ మన్ననలు పొందిన సినీనటుడు సోనూ సూద్పై శివసేన మాత్రం తీవ్రంగా విరుచుకుపడింది. శివసేన అధికారిక పత్రిక సామ్నా వేదికగా పలు ప్రశ్నలు సంధించింది. కరోనా సమయంలో వచ్చిన కొత్త మహాత్మడు అంటూ సోనూ సూద్పై వ్వంగ్యాస్త్రాలు సంధించింది. అటు, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా సోనూ చేసిన సహాయంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. లాక్డౌన్ సమయంలో లక్షలాది మంది వలస కార్మికులను స్వస్థలాలకు తరలించారని.. అయితే, ఆ సమయంలో అన్ని బస్సులు ఎలా అందుబాటులోకి వచ్చాయని ప్రశ్నించారు. ఇంకా లాక్డౌన్లో ఏ రాష్ట్రంలో కూడా వలస కార్మికులను అనుమతించలేదని.. అయితే, వీరంతా ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. ఆయన త్వరలో ప్రధాని మోదీని కలుస్తారని.. సెలబ్రిటీ మేనేజర్ ఆఫ్ ముంబైగా మారిపోతారని సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు. ఆయన చేసిన పని చాలా మంచిదని.. దానిని మేము సమర్థిస్తామని.. కానీ, ఆయన వెనుక ఉన్న ఎవరో పొలిటిల్ డైరక్టర్ ఉండే ఉంటారని ఆరోపించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?