కువైట్:పౌర గుర్తింపు కార్డు లేకున్నా ప్రయాణించేందుకు ప్రవాసీయులకు అనుమతి
- June 07, 2020
కువైట్:దేశం విడిచి వెళ్లాలనుకునే ప్రవాసీయులు ఇక నుంచి పౌర గుర్తింపు కార్డులు లేకున్నా ప్రయాణించేందుకు కువైట్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అయితే..చెల్లుబాటులో ఉన్న వారి నివాసిత అనుమతి పత్రాల్లోని లాటిన్ పేరుతో పాస్ పోర్ట్ వివరాలు సరిపోలాలని కూడా షరతు విధించింది. కరోనా నేపథ్యంలో కార్యాలయాల సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో పౌర గుర్తింపు కార్డులు ఇవ్వనందున కువైట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విమానాశ్రయ భద్రతా సిబ్బందికి తగిన ఆదేశాలు కూడా జారీ చేసింది. పౌర గుర్తింపు కార్డులు లేకున్నా...చెల్లుబాటులో ఉన్న నివాస అనుమతి పత్రాలు, పాస్ పోర్టులోని వివరాలను సరిచూసుకొని ఎయిర్ పోర్టులోకి అనుమతి ఇవ్వాలని అధికారులకు సూచించింది. అయితే..ఇప్పటికే వివిధ దేశాల్లో ఉండిపోయిన ప్రవాసీయుల సివిల్ ఐడీ కార్డుల గడువు కూడా ముగిసిన విషయం తెలిసింది. అలాంటి వారు వివిధ దేశాల నుంచి కువైట్ కు వచ్చే వారి విషయంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?