కువైట్:పౌర గుర్తింపు కార్డు లేకున్నా ప్రయాణించేందుకు ప్రవాసీయులకు అనుమతి
- June 07, 2020
కువైట్:దేశం విడిచి వెళ్లాలనుకునే ప్రవాసీయులు ఇక నుంచి పౌర గుర్తింపు కార్డులు లేకున్నా ప్రయాణించేందుకు కువైట్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అయితే..చెల్లుబాటులో ఉన్న వారి నివాసిత అనుమతి పత్రాల్లోని లాటిన్ పేరుతో పాస్ పోర్ట్ వివరాలు సరిపోలాలని కూడా షరతు విధించింది. కరోనా నేపథ్యంలో కార్యాలయాల సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో పౌర గుర్తింపు కార్డులు ఇవ్వనందున కువైట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విమానాశ్రయ భద్రతా సిబ్బందికి తగిన ఆదేశాలు కూడా జారీ చేసింది. పౌర గుర్తింపు కార్డులు లేకున్నా...చెల్లుబాటులో ఉన్న నివాస అనుమతి పత్రాలు, పాస్ పోర్టులోని వివరాలను సరిచూసుకొని ఎయిర్ పోర్టులోకి అనుమతి ఇవ్వాలని అధికారులకు సూచించింది. అయితే..ఇప్పటికే వివిధ దేశాల్లో ఉండిపోయిన ప్రవాసీయుల సివిల్ ఐడీ కార్డుల గడువు కూడా ముగిసిన విషయం తెలిసింది. అలాంటి వారు వివిధ దేశాల నుంచి కువైట్ కు వచ్చే వారి విషయంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







