కువైట్:పౌర గుర్తింపు కార్డు లేకున్నా ప్రయాణించేందుకు ప్రవాసీయులకు అనుమతి
- June 07, 2020
కువైట్:దేశం విడిచి వెళ్లాలనుకునే ప్రవాసీయులు ఇక నుంచి పౌర గుర్తింపు కార్డులు లేకున్నా ప్రయాణించేందుకు కువైట్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అయితే..చెల్లుబాటులో ఉన్న వారి నివాసిత అనుమతి పత్రాల్లోని లాటిన్ పేరుతో పాస్ పోర్ట్ వివరాలు సరిపోలాలని కూడా షరతు విధించింది. కరోనా నేపథ్యంలో కార్యాలయాల సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో పౌర గుర్తింపు కార్డులు ఇవ్వనందున కువైట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విమానాశ్రయ భద్రతా సిబ్బందికి తగిన ఆదేశాలు కూడా జారీ చేసింది. పౌర గుర్తింపు కార్డులు లేకున్నా...చెల్లుబాటులో ఉన్న నివాస అనుమతి పత్రాలు, పాస్ పోర్టులోని వివరాలను సరిచూసుకొని ఎయిర్ పోర్టులోకి అనుమతి ఇవ్వాలని అధికారులకు సూచించింది. అయితే..ఇప్పటికే వివిధ దేశాల్లో ఉండిపోయిన ప్రవాసీయుల సివిల్ ఐడీ కార్డుల గడువు కూడా ముగిసిన విషయం తెలిసింది. అలాంటి వారు వివిధ దేశాల నుంచి కువైట్ కు వచ్చే వారి విషయంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు







