సౌదీ అరేబియా నుంచి ఎన్ఆర్ఐలను భారత్ తరలించనున్న గల్ఫ్ ఎయిర్

- June 07, 2020 , by Maagulf
సౌదీ అరేబియా నుంచి ఎన్ఆర్ఐలను భారత్ తరలించనున్న గల్ఫ్ ఎయిర్

మనామా:సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులను ఇండియా తీసుకొచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్ లో గల్ఫ్ ఎయిర్ కూడా భాగస్వామ్యం కానుంది. ఈ మేరకు బహ్రెయిన్ కు చెందిన గల్ఫ్ ఎయిర్ ప్రతినిధులు..సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. దమ్మమ్ విమానాశ్రయం నుంచి భారత్ లోని చెన్నై, అహ్మదాబాద్, మంగళూరు, కొచ్చి విమానాశ్రయాలకు గల్ఫ్ ఎయిర్ సంస్థ తమ ప్రత్యేక సర్వీసులను నడపనుంది. కరోనా సంక్షోభంలోనూ ఇప్పటికీ సేవలను అందిస్తున్న అతికొద్ది సంస్థల్లో గల్ఫ్ ఎయిర్ ఒకటి. వివిధ దేశాల్లోని పౌరులను, సరుకు రవాణాను చేరవేసేందుకు ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ఇటీవలె లాహోర్ నుంచి రియాద్ కు 50 టన్నుల మాంసాన్ని కార్గో ఫ్లైట్ లో తరలించింది. 

 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com