భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల వివరాలు
- June 08, 2020
రెండు నెలలు లాక్డౌన్ చేసిన తర్వాత ప్రభుత్వం అనేక సడలింపులను అనుమతించినప్పటికీ, 24 గంటల్లో 9,983 కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాణాంతక వ్యాధి కారణంగా గత 24 గంటల్లో 206 మంది మరణించారు. తాజా కేసులతో భారత్ లో కరోనావైరస్ కేసుల సంఖ్య సోమవారం నాటికి 2.56 లక్షల కేసులను దాటాయి. ప్రభుత్వ డేటా ప్రకారం వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 7,135 గా ఉంది. మొత్తం కేసుల సంఖ్య 2,56,611 ఉండగా.. ఇందులో 1,24,095 మంది కోలుకున్నారు.
భారతదేశంలో కరోనా రికవరీ రేటు ప్రస్తుతం 48.35 శాతంగా ఉంది, అయితే ఇందులో వృద్ధి రేటు 3.89 శాతంగా ఉంది. మహారాష్ట్ర దేశంలోనే అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రంగా ఉంది.. మొత్తం 85,000 కేసులతో చైనా సంఖ్యను అధిగమించింది. రాష్ట్రంలో 3 వేలకు పైగా మరణించారు.. మహారాష్ట్ర రాజధాని ముంబై.. దేశంలో అత్యంత నష్టపోయిన నగరాల్లో ఒకటిగా ఉంది. ఆ తరువాత తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలున్నాయి.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







