వేసవిలో కార్మికుల పని గంటల కుదింపు.. షెడ్యూల్ ప్రకటించిన ఖతార్ ప్రభుత్వం
- June 10, 2020
దోహా:వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో పని చేసే కార్మికుల పని గంటలను కుదించింది ఖతార్ ప్రభుత్వం. ప్రతి రోజు 11.30 నుంచి 3.00 గంటల వరకు కార్మికులకు విశ్రాంతి ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ, కార్మిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జూన్ 15 నుంచి ఆగస్ట్ 31 వరకు మధ్యాహ్నం సమయంలో కార్మికులతో ఎలాంటి పనులు చేయించవద్దని ఆయా సంస్థలు, కంపెనీల యాజమాన్యాలకు సూచించింది. పగటి సమయంలో 5 గంటలకు మించి పని వేళలు ఉండరాదని కూడా స్పష్టం చేసింది.
కార్మిక చట్టం 2004 లో లా నంబర్ 14 నిబంధనలకు లోబడి ఉన్న సంస్థలు, కంపెనీలన్నీ 2007లో మంత్రిత్వ శాఖ చేసిన తీర్మానం నెంబర్ 16 కు అనుగుణంగా పనివేళలు ఉండాలని కార్మిక శాఖ తమ అధికారిక ట్విట్టర్ లో వెల్లడించింది. వేసవిలో కార్మికుల పనిగంటల నిబంధనలను ఆయా కంపెనీలు నిఖచ్చిగా అమలు చేసి తీరాల్సిందేనని కూడా హెచ్చరించింది. లేబర్ ఇన్స్ పెక్టర్లు..పలు కంపెనీల పని ప్రదేశాలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడతారని, నిబంధలను ఉల్లంఘించిన కంపెనీ యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకుంటామని కూడా కార్మిక శాఖ హెచ్చరించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?