భారతీయ సిబ్బందిని ప్రత్యేక చార్టర్డ్ విమానాల్లో పంపిన సౌదీ సంస్థ
- June 10, 2020
రియాద్: కరోనా నేపథ్యంలో సౌదీ అరేబియాకు చెందిన ఎక్సపెర్టిస్ కాంట్రాక్టింగ్ కంపెనీ ఐదు దేశాలకు చెందిన సుమరు 2 వేల మంది సిబ్బందిని ప్రత్యేక చార్టర్డ్ విమానాల్లో పంపింది. ఇందులో 1,665 మంది భారతీయులున్నట్లు ఆ సంస్థ తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 50 ఏండ్లుపైబడిన వారు, గర్భవతులు, వైద్య సేవలు అవసరమైన వారిని గల్ఫ్ ఎయిర్కు చెందిన 12 చార్టర్డ్ విమానాల్లో వారి దేశాలకు తరలిస్తున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా ఈ నెల 5 నుంచి 7 వరకు చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, ఢిల్లీ, మంగళూరుకు ఆరు విమానాల ద్వారా కొందరు చేరుకున్నట్లు వెల్లడించింది. జూన్ 11 నాటికి మరో మూడు విమానాలు భారత్కు చేరుతాయని, ఇక్కడితో ఈ ప్రక్రియ ముగుస్తుందని ఆ సంస్థ తెలిపింది.
సిబ్బంది ప్రయాణ వ్యయాలతోపాటు క్వారంటైన్ ఖర్చులను సంస్థే భరిస్తున్నదని, వారిని ఇలా తరలించడం ఇదే తొలిసారని ఆ కంపెనీ తెలిపింది. మరి కొంత మంది సిబ్బందిని కూడా వారి దేశాలకు తరలించే యోచనలో ఉన్నామని, కరోనా వల్ల నెలకొన్న పరిస్థితులు కుదుటపడిన తర్వాత వారు పని చేసే కంపెనీలకు తిరిగి రప్పిస్తామని ఆ కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







