భారతీయ సిబ్బందిని ప్రత్యేక చార్టర్డ్‌ విమానాల్లో పంపిన సౌదీ సంస్థ

- June 10, 2020 , by Maagulf
భారతీయ సిబ్బందిని ప్రత్యేక చార్టర్డ్‌ విమానాల్లో పంపిన సౌదీ సంస్థ

రియాద్‌: కరోనా నేపథ్యంలో సౌదీ అరేబియాకు చెందిన ఎక్సపెర్టిస్ కాంట్రాక్టింగ్ కంపెనీ ఐదు దేశాలకు చెందిన సుమరు 2 వేల మంది సిబ్బందిని ప్రత్యేక చార్టర్డ్‌ విమానాల్లో పంపింది. ఇందులో 1,665 మంది భారతీయులున్నట్లు ఆ సంస్థ తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 50 ఏండ్లుపైబడిన వారు, గర్భవతులు, వైద్య సేవలు అవసరమైన వారిని గల్ఫ్‌ ఎయిర్‌కు చెందిన 12 చార్టర్డ్‌ విమానాల్లో వారి దేశాలకు తరలిస్తున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా ఈ నెల 5 నుంచి 7 వరకు చెన్నై, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, ఢిల్లీ, మంగళూరుకు ఆరు విమానాల ద్వారా కొందరు చేరుకున్నట్లు వెల్లడించింది. జూన్‌ 11 నాటికి మరో మూడు విమానాలు భారత్‌కు చేరుతాయని, ఇక్కడితో ఈ ప్రక్రియ ముగుస్తుందని ఆ సంస్థ తెలిపింది. 

సిబ్బంది ప్రయాణ వ్యయాలతోపాటు క్వారంటైన్‌ ఖర్చులను సంస్థే భరిస్తున్నదని, వారిని ఇలా తరలించడం ఇదే తొలిసారని ఆ కంపెనీ తెలిపింది. మరి కొంత మంది సిబ్బందిని కూడా వారి దేశాలకు తరలించే యోచనలో ఉన్నామని, కరోనా వల్ల నెలకొన్న పరిస్థితులు కుదుటపడిన తర్వాత వారు పని చేసే కంపెనీలకు తిరిగి రప్పిస్తామని ఆ కాంట్రాక్ట్‌ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com