కరోనా ఎఫెక్ట్: మరింతమంది ఉద్యోగులకు లే-ఆఫ్ ప్రకటించిన ఎమిరేట్స్
- June 10, 2020
దుబాయ్:ప్రపంచంలోనే అతి పెద్ద లాంగ్ హాల్ ఎయిర్లైన్ ఎమిరేట్స్, మరింత మంది ఉద్యోగులకు లే-ఆఫ్ ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఈ లే-ఆఫ్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సంస్థ పేర్కొంది. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతనే విధిలేని పరిస్థితుల్లో లే-ఆఫ్ ప్రకటిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఎమిరేట్స్ సంస్థ 60,000 మందికి పైగా ఉద్యోగుల్ని కలిగి వుంది. మే 31న ఓసారి ఎమిరేట్స్ ఉద్యోగుల లే-ఆఫ్ని ప్రకటించిన విషయం విదితమే. కాగా, గ్లోబల్ ఎయిర్లైన్స్ 84.3 బిలియన్ డాలర్ల నష్టాన్ని ఈ ఏడాది చవిచూడటం జరిగింది. ఏవియేషన్ రంగంలోనే అతి పెద్ద నష్టంగా దీన్ని అభివర్ణించవచ్చు. ఈ పరిస్థితిని ఎలా అభివర్ణించాలో అర్థం కావడంలేదని పౌర విమానయాన రంగ నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







