ఒమన్లో టూరిజం ఎట్రాక్షన్స్ మూసివేత, కొత్త బిజినెస్ల పునః ప్రారంభం
- June 10, 2020
ఒమాన్: కరోనా వైరస్ నేపథ్యంలో ఏర్పాటైన సుప్రీం కమిటీ, ఓ సమావేశాన్ని నిర్వహించింది. మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ సయ్యిద్ హమౌద్ బిన్ ఫైసల్ అల్ బుసైదీ ఈ మీటింగ్కి నాయకత్వం వహించారు. జబెల్ అక్దర్, జబెల్ షాంస్, మసిరాహ్ మరియు దోఫార్ గవర్నరేట్స్ పరిధిలోని టూరిజం డెస్టినేషన్స్ని మూసివేస్తూ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జూన్ 13 నుంచి జులై 3 వరకు ఈ లాక్డౌన్ అమల్లో వుంటుంది. పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుగుతుందని ఈ సందర్భంగా కమిటీ పేర్కొంది. ఎక్కువమంది గుమికూడే అవకాశం వున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, జూన్ 10 నుంచి కొత్త ప్యాకేజీని కమర్షియల్ మరియు ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ కోసం అమల్లోకి తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?