ఫేక్ రూమర్స్ని ప్రచారం చేస్తే ఏడాది, ఆపైన జైలు శిక్ష
- June 10, 2020
షార్జా: ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేలా దుష్ప్రచారానికి ఒడిగడితే ఏడాది అంతకు మించి జైలు శిక్ష విధించడం జరుగుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. ఫెడరల్ పీనల్ కోడ్ - ఆర్టికల్ 198, పేరాగ్రాఫ్ ప్రకారం ఎవరైతే కావాలని దుష్ప్రచారానికి దిగుతారో, రూమర్స్ని ప్రచారం చేస్తారో, ప్రజల్లో అనవసర భయాందోళనలకు కారకులవుతారో అలాంటివారికి ఏడాదికి తక్కువ కాకుండా జైలు శిక్ష పడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. కాగా, పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్మార్ట్ ప్లాటుఫార్మ్స్ ద్వారా పిటిషన్ లేదా కంప్లయింట్ నమోదు చేసే విధానాన్ని వెల్లడించారు. ఇదిలా వుంటే, షార్జాలో సెక్యూరిటీ సర్వీసెస్, ఓ ట్యాక్సీ డ్రైవర్ని అరెస్ట్ చేయడం జరిగింది. రద్దు చేయబడిన పనులను రోడ్డుపై ప్రదర్శిస్తున్నట్లు అతనిపై అభియోగాలు వచ్చాయి.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







