సౌదీ అరేబియా:కోవిడ్ 19 పరీక్షలు చేయించుకున్న 5,200 మంది ప్రవాసీయులు

- June 11, 2020 , by Maagulf
సౌదీ అరేబియా:కోవిడ్ 19 పరీక్షలు చేయించుకున్న 5,200 మంది ప్రవాసీయులు

సౌదీ అరేబియా:కరోనా వ్యాప్తి నియంత్రణకు మదీనా మున్సిపాలిటి చేపట్టిన కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలను ప్రవాసీయులు సద్వినియోగ పరుచుకుంటున్నారు. దాదాపు 5,200 మంది ప్రవాసీయులు వైరస్ నిర్ధారణ పరీక్షల శిబిరాలకు వెళ్లి పరీక్ష చేయించుకున్నారు. మదీనా మున్సిపాలిటి పరిధిలోని పండ్లు, కూరగాయల మార్కెట్ తో పాటు షాపింగ్ మాల్స్, ప్రవాసీయులు ఉండే ప్రాంతాల్లో వ్యాధి నిర్ధారణ శిబిరాలను ఏర్పాటు చేశారు. అలాగే వలస కార్మికులు ఎక్కువ ఉండే చోట ధర్మల్ ఇమేజింగ్, మాస్ టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వైరస్ బారిన పడిన వారిని తక్షణమే గుర్తించేందుకు మొబైల్ థర్మల్ కెమెరాలను వినియోగిస్తున్నారు. అలాగే కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ప్రవాసీయులకు పలు సూచనలు చేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com