కేంద్ర విదేశాంగ శాఖకు సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ

- June 11, 2020 , by Maagulf
కేంద్ర విదేశాంగ శాఖకు సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ

అమరావతి:లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని రప్పించేందుకు మరిన్ని విమానసర్వీసులను నడపాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. యూ.ఏ.ఈ,ఖతార్,సౌదీ అరేబియా,బహ్రెయిన్‌, సింగపూర్‌ దేశాల్లో ఎక్కువ మంది తెలుగువారు చిక్కుకుపోయారని వారందరినీ తరలించేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖకు జగన్‌ లేఖ రాశారు. కాగా విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వందే భారత్‌ మిషన్‌’ ద్వారా ప్రత్యేక విమానాలను నడిపిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com