మనామా:ఫేస్ మాస్క్ ధరించని 721 మందికి జరిమానా
- June 14, 2020
మనామా:కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ నిబధనలు పాటించని దాదాపు 721 మందికి పోలీసులు జరిమానా విధించారు. ఎపిడమిక్ యాక్ట్ అమలులో భాగంగా కరోనా కట్టడికి బహ్రెయిన్ ప్రభుత్వం పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. బహరింగ ప్రదేశాల్లో తిరిగే ప్రజలు ఖచ్చితంగా ఫేస్ మాస్క్ ధరించాలని, ఒకే చోట ఐదుగురికి మించి గుమికూడొద్దని..ఆ ఐదుగురు కూడా ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలనే ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే..ఓ వైపు కరోనా ఇంకా నియంత్రణలోకి రాకుండా భయపెడుతున్నా..కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫేస్ మాస్కులు ధరించకుండానే పబ్లిక్ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ముహర్రఖ్ ప్రాంతంలో ఫేస్ మాస్క్ లు ధరించకుండా తిరుగుతున్న 721 మందికి పోలీసులు ఫైన్ వధించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







