మనామా:ఫేస్ మాస్క్ ధరించని 721 మందికి జరిమానా

- June 14, 2020 , by Maagulf
మనామా:ఫేస్ మాస్క్ ధరించని 721 మందికి జరిమానా

మనామా:కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ నిబధనలు పాటించని దాదాపు 721 మందికి పోలీసులు జరిమానా విధించారు. ఎపిడమిక్ యాక్ట్ అమలులో భాగంగా కరోనా కట్టడికి బహ్రెయిన్ ప్రభుత్వం పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. బహరింగ ప్రదేశాల్లో తిరిగే ప్రజలు ఖచ్చితంగా ఫేస్ మాస్క్ ధరించాలని, ఒకే చోట ఐదుగురికి మించి గుమికూడొద్దని..ఆ ఐదుగురు కూడా ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలనే ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే..ఓ వైపు కరోనా ఇంకా నియంత్రణలోకి రాకుండా భయపెడుతున్నా..కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫేస్ మాస్కులు ధరించకుండానే పబ్లిక్ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ముహర్రఖ్ ప్రాంతంలో ఫేస్ మాస్క్ లు ధరించకుండా తిరుగుతున్న 721 మందికి పోలీసులు ఫైన్ వధించారు. 

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com