దోఫర్ గవర్నరేట్ పరిధిలో లాక్ డౌన్ అమలు, పర్యాటక ప్రాంతాల మూసివేత
- June 14, 2020
మస్కట్:కరోనా కట్టడిలో భాగంగా దోఫర్ గవర్నరేట్ పరిధిలో పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. సుల్తాన్ సాయుధ బలగాలతో పాటు, రాయల్ ఓమన్ పోలీసులు సంయుక్తంగా పలు ప్రాంతాల్లో చెకింగ్ పాయింట్స్ ను ఏర్పాటు చేశారు. పౌరులు, ప్రవాసీయులు ఈ విషయాన్ని గమనించి దోఫర్ గవర్నరేట్ ప్రాంతంలోకి అత్యవసరం అయితే రావొద్దని కూడా అధికారులు సూచించారు. కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం ఏర్పాటైన సుప్రీం కమిటీ సూచనల మేరకు దోఫర్ పరిధిలో నిన్న మధ్యాహ్నం నుంచి వచ్చే నెల 3 వరకు లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. జబల్ షామ్స్, జబల్ అల్ అఖ్దర్, మాసిరా ద్వీపంతో పాటు పలు పర్యాటక ప్రాంతాలను మూసివేయించారు. సుప్రీం కమిటీ సూచనల మేరకు లాక్ డౌన్ ను సమర్ధవంతంగా అమలు చేసేలా భద్రత బలగాలకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..







