దోఫర్ గవర్నరేట్ పరిధిలో లాక్ డౌన్ అమలు, పర్యాటక ప్రాంతాల మూసివేత
- June 14, 2020
మస్కట్:కరోనా కట్టడిలో భాగంగా దోఫర్ గవర్నరేట్ పరిధిలో పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. సుల్తాన్ సాయుధ బలగాలతో పాటు, రాయల్ ఓమన్ పోలీసులు సంయుక్తంగా పలు ప్రాంతాల్లో చెకింగ్ పాయింట్స్ ను ఏర్పాటు చేశారు. పౌరులు, ప్రవాసీయులు ఈ విషయాన్ని గమనించి దోఫర్ గవర్నరేట్ ప్రాంతంలోకి అత్యవసరం అయితే రావొద్దని కూడా అధికారులు సూచించారు. కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం ఏర్పాటైన సుప్రీం కమిటీ సూచనల మేరకు దోఫర్ పరిధిలో నిన్న మధ్యాహ్నం నుంచి వచ్చే నెల 3 వరకు లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. జబల్ షామ్స్, జబల్ అల్ అఖ్దర్, మాసిరా ద్వీపంతో పాటు పలు పర్యాటక ప్రాంతాలను మూసివేయించారు. సుప్రీం కమిటీ సూచనల మేరకు లాక్ డౌన్ ను సమర్ధవంతంగా అమలు చేసేలా భద్రత బలగాలకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







