దోఫర్ గవర్నరేట్ పరిధిలో లాక్ డౌన్ అమలు, పర్యాటక ప్రాంతాల మూసివేత
- June 14, 2020
మస్కట్:కరోనా కట్టడిలో భాగంగా దోఫర్ గవర్నరేట్ పరిధిలో పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. సుల్తాన్ సాయుధ బలగాలతో పాటు, రాయల్ ఓమన్ పోలీసులు సంయుక్తంగా పలు ప్రాంతాల్లో చెకింగ్ పాయింట్స్ ను ఏర్పాటు చేశారు. పౌరులు, ప్రవాసీయులు ఈ విషయాన్ని గమనించి దోఫర్ గవర్నరేట్ ప్రాంతంలోకి అత్యవసరం అయితే రావొద్దని కూడా అధికారులు సూచించారు. కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం ఏర్పాటైన సుప్రీం కమిటీ సూచనల మేరకు దోఫర్ పరిధిలో నిన్న మధ్యాహ్నం నుంచి వచ్చే నెల 3 వరకు లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. జబల్ షామ్స్, జబల్ అల్ అఖ్దర్, మాసిరా ద్వీపంతో పాటు పలు పర్యాటక ప్రాంతాలను మూసివేయించారు. సుప్రీం కమిటీ సూచనల మేరకు లాక్ డౌన్ ను సమర్ధవంతంగా అమలు చేసేలా భద్రత బలగాలకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







