నోట్లను చించినా, కాల్చినా, అవమానించినా భారీ జరిమానా..యూఏఈ వార్నింగ్
- June 14, 2020
యూఏఈ కరెన్సీని కించపరిచేలా ఎలాంటి పనులు చేసినా కఠిన శిక్షలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆ దేశ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రజలను హెచ్చరించింది. నోటుపై జాతీయ చిహ్నం ఉంటుంది కనుక దాన్ని కాగితం ముక్కలాగ తీసివేసే ధోరణిని ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చింది. నోటు మెటిరియల్ కన్నా..నోటుపై ఉండే జాతీయ చిహ్నాన్ని గౌరవించటం ప్రజల నైతిక బాధ్యత అతని గుర్తు చేసింది. కరెన్సీ నోటును చించినా, తగలబెట్టినా, నాశనం చేసినా, కించపరిచేలా వ్యవహరించినా..ఆ కరెన్సీ నోటుకు విలువకు పది రెట్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అలాగే సోషల్ మీడియాలో వీడియోలను అప్ లోడ్ చేసే ముందు, పోస్టులు పెట్టే ముందు నెటిజన్లు కూడా ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని కూడా సూచించింది. యూఏఈ చట్టాల ప్రకారం ప్రభుత్వాన్ని కించపరిచే చర్యలు, జాతీయ చిహ్నాం గౌరవాన్ని కించపరిచే చర్యలపై కఠిన శిక్షలు ఉంటాయి. నేర తీవ్రతను బట్టి ఒక్కోసారి కనిష్టం 10 ఏళ్ల నుంచి గరిష్టం 25 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే జాతీయ గీతం, జాతీయ జెండాను అవమానించిన, దేశ గౌరవ సూచికలను కించపరిచినా, పాలకులను అవమానించేలా మాట్లాడినా, పోస్టులు పెట్టినా మిలియన్ దిర్హామ్ ల వరకు జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని అంతా దేశ గౌరవాన్ని పెంపొందించేలా పాటుపడాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రజలకు సూచించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







