నోట్లను చించినా, కాల్చినా, అవమానించినా భారీ జరిమానా..యూఏఈ వార్నింగ్
- June 14, 2020
యూఏఈ కరెన్సీని కించపరిచేలా ఎలాంటి పనులు చేసినా కఠిన శిక్షలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆ దేశ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రజలను హెచ్చరించింది. నోటుపై జాతీయ చిహ్నం ఉంటుంది కనుక దాన్ని కాగితం ముక్కలాగ తీసివేసే ధోరణిని ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చింది. నోటు మెటిరియల్ కన్నా..నోటుపై ఉండే జాతీయ చిహ్నాన్ని గౌరవించటం ప్రజల నైతిక బాధ్యత అతని గుర్తు చేసింది. కరెన్సీ నోటును చించినా, తగలబెట్టినా, నాశనం చేసినా, కించపరిచేలా వ్యవహరించినా..ఆ కరెన్సీ నోటుకు విలువకు పది రెట్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అలాగే సోషల్ మీడియాలో వీడియోలను అప్ లోడ్ చేసే ముందు, పోస్టులు పెట్టే ముందు నెటిజన్లు కూడా ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని కూడా సూచించింది. యూఏఈ చట్టాల ప్రకారం ప్రభుత్వాన్ని కించపరిచే చర్యలు, జాతీయ చిహ్నాం గౌరవాన్ని కించపరిచే చర్యలపై కఠిన శిక్షలు ఉంటాయి. నేర తీవ్రతను బట్టి ఒక్కోసారి కనిష్టం 10 ఏళ్ల నుంచి గరిష్టం 25 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే జాతీయ గీతం, జాతీయ జెండాను అవమానించిన, దేశ గౌరవ సూచికలను కించపరిచినా, పాలకులను అవమానించేలా మాట్లాడినా, పోస్టులు పెట్టినా మిలియన్ దిర్హామ్ ల వరకు జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని అంతా దేశ గౌరవాన్ని పెంపొందించేలా పాటుపడాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రజలకు సూచించింది.
తాజా వార్తలు
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!







