దోఫర్ గవర్నరేట్ పరిధిలో లాక్ డౌన్ అమలు, పర్యాటక ప్రాంతాల మూసివేత
- June 14, 2020
మస్కట్:కరోనా కట్టడిలో భాగంగా దోఫర్ గవర్నరేట్ పరిధిలో పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. సుల్తాన్ సాయుధ బలగాలతో పాటు, రాయల్ ఓమన్ పోలీసులు సంయుక్తంగా పలు ప్రాంతాల్లో చెకింగ్ పాయింట్స్ ను ఏర్పాటు చేశారు. పౌరులు, ప్రవాసీయులు ఈ విషయాన్ని గమనించి దోఫర్ గవర్నరేట్ ప్రాంతంలోకి అత్యవసరం అయితే రావొద్దని కూడా అధికారులు సూచించారు. కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం ఏర్పాటైన సుప్రీం కమిటీ సూచనల మేరకు దోఫర్ పరిధిలో నిన్న మధ్యాహ్నం నుంచి వచ్చే నెల 3 వరకు లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. జబల్ షామ్స్, జబల్ అల్ అఖ్దర్, మాసిరా ద్వీపంతో పాటు పలు పర్యాటక ప్రాంతాలను మూసివేయించారు. సుప్రీం కమిటీ సూచనల మేరకు లాక్ డౌన్ ను సమర్ధవంతంగా అమలు చేసేలా భద్రత బలగాలకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?