సుశాంత్ మరణ వార్త విని ఆయన మరదలు కూడా...

- June 16, 2020 , by Maagulf
సుశాంత్ మరణ వార్త విని ఆయన మరదలు కూడా...

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణవార్త యావత్ సినీ ఇండస్ట్రీని కలచివేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆయన ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. సుశాంత్ అంత్యక్రియలు జరిగి 24 గంటలు కాకముందే ఆయన మరదలు (సుశాంత్ కజిన్ భార్య) సుధా దేవి బీహార్ లోని పుర్నియాలో తుది శ్వాస విడిచింది. ముంబయిలో సుశాంత్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ఆమె కుప్పకూలి మరణించిందని తెలుస్తోంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసినప్పటి నుండి ఆమె ఆహరం తీసుకోవడం మానేసినట్టు తెలుస్తోంది. ఆమె ఎంతో ఆప్యాయంగా చూసుకునే సుశాంత్ మరణాన్ని ఆమె తట్టుకోలేకపోయిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇక సుశాంత్ ఆత్మహత్య అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అతడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com