షార్జా:విధుల పునరుద్ధరణకు వీలుగా 5000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా టెస్టులు
- June 16, 2020
షార్జాలో ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి విధులకు హజరుకానున్నారు. సిబ్బందిలో 30 శాతం మంది ఆఫీసులకు రావాలని షార్జా మానవ వనరుల శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 5 వేల మంది ఎంప్లాయిస్ కి టెస్టులు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. విధులకు హజరయ్యే ఉద్యోగుల భద్రతతో పాటు ఆయా కార్యాలయాల్లో పనుల కోసం వచ్చే ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేవలం ఐదు నిమిషాల్లోనే శాంపుల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. టెస్ట్ ఫలితాలు 72 గంటల్లో వస్తాయని, నేరుగా ఉద్యోగి మొబైల్ నెంబర్ కు మెసేజ్ ద్వారా పరీక్ష ఫలితాలను చేరుతాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు