జూన్ 23 నుంచి విదేశాల ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్..ప్రకటించిన యూఏఈ
- June 16, 2020
యూఏఈ:కరోనా తర్వాత సాధారణ జనజీవన పునరుద్ధరణలో మరో కీలక నిర్ణయం తీసుకుంది యూఏఈ ప్రభుత్వం. యూఏఈ నుంచి ఇతర దేశాలకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 23 నుంచి దేశ పౌరులు, ప్రవాసీయుల విదేశీ ప్రయాణాలకు అనుమతించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ, పౌర గుర్తింపు అధికారుల సమాఖ్య శాఖలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. అయితే..యూఏఈ నుంచి ఏయే గమ్యస్థానాలకు అనుమతి ఉంటుందో త్వరలోనే వెల్లడిస్తామని కూడా అధికారులు తెలిపారు. అయితే..కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్ని తీసుకోవాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్లే వారు అక్కడ ఎన్ని రోజులు ఉంటారు..ఎప్పుడు తిరిగి వస్తారు..తిరిగి వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ప్రయాణ సమయంలో వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







