జూన్ 23 నుంచి విదేశాల ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్..ప్రకటించిన యూఏఈ
- June 16, 2020
యూఏఈ:కరోనా తర్వాత సాధారణ జనజీవన పునరుద్ధరణలో మరో కీలక నిర్ణయం తీసుకుంది యూఏఈ ప్రభుత్వం. యూఏఈ నుంచి ఇతర దేశాలకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 23 నుంచి దేశ పౌరులు, ప్రవాసీయుల విదేశీ ప్రయాణాలకు అనుమతించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ, పౌర గుర్తింపు అధికారుల సమాఖ్య శాఖలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. అయితే..యూఏఈ నుంచి ఏయే గమ్యస్థానాలకు అనుమతి ఉంటుందో త్వరలోనే వెల్లడిస్తామని కూడా అధికారులు తెలిపారు. అయితే..కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్ని తీసుకోవాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్లే వారు అక్కడ ఎన్ని రోజులు ఉంటారు..ఎప్పుడు తిరిగి వస్తారు..తిరిగి వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ప్రయాణ సమయంలో వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







