కరోనాకు ఫ్రీ ట్రీట్ మెంట్ చేయమని పిటిషన్.. రూ.5లక్షలు ఫైన్ వేస్తూ ఘాటుగా స్పందించిన హైకోర్టు
- June 17, 2020
కరోనా వైరస్ సోకిన పేషెంట్లు అందరికీ ఉచితంగా చికిత్స అందించాలని కోరుతూ..పిటిషన్ వేసిన ఓ వ్యక్తికి బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రముఖ విద్యావేత్త సాగర్ జోంధాలే బాంబే హైకోర్టులో కరోనా సోకిన బాధితులకు ఫ్రీ ట్రీట్ మెంట్ చేయాలని పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ పై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ డిమాండ్ అర్థం పర్థం లేనిదంటూ వ్యాఖ్యానిస్తూ..పిటిషనర్ కు రూ. 5 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తం జరిమానాని నెల రోజుల్లో ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. దీంతో సదరు పిటీషన్ దారుడు ఆశ్చర్యపోయాడు.
కరోనాను ఆసరాగా తీసుకుని ప్రైవేటు ఆసుపత్రులు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయని... అంశాన్ని దృష్టిలో ఉంచుకుని కరోనా బాధితులందరికీ ఉచితంగా చికిత్స అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరుతూ వేసిన పిటిషన్ కు ఇటువంటి షాక్ ఇవ్వటం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే.
పేదవారు గొప్పవారు అనే తేడా లేకుండా కరోనా కాటుకు ప్రజలు బలైపోతున్న క్రమంలో కరోనాను అడ్డంపెట్టుకుని కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రజల్ని ఇష్టారాజ్యంగా దోచుకుంటున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో కరోనా బాధితులకు ఫ్రీ ట్రీట్ మెంట్ చేయాలని కోరుతూ వేసిన పిటీషన్ దారుడిపై న్యాయస్థానం స్పందన కాస్త ఘాటుగానేఉంది. పిటీషన్ అర్థరహితమైతే కొట్టేయవచ్చు. కానీ ఇలా పిటీషన్ దారుడికి జరిమానా వేయటం ఆశ్చర్యాన్నికలిగిస్తోంది.
కాగా..కరోనాతో ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లిన ఓ వ్యక్తికి సదరు ఆస్పత్రి రూ.1లక్ష బిల్లు వేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







