గల్వాన్ ఘటన: వీరమరణం పొందిన సైనికుల పేర్లు
- June 17, 2020
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా దురాగతాలకు 20 మంది భారత సైనికులు అసువులు బాసిన సంగతి తెలిసిందే.. లద్దాఖ్లోని గాల్వన్లోయలో చైనా సైనికులు.. మన జవాన్లపై రాళ్లు విసిరి, రాడ్లతో దాడికి దిగడంతో... వారికి మన సైనికులు దీటుగా బదులిచ్చారు. ఈ హింసాత్మక ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. పుట్టిన గడ్డ కోసం ప్రాణత్యాగం చేసిన 20 మంది వీర సైనికులు ఎవరనేది బయటకు వచ్చింది.. వారి పేర్లకు సంబంధించిన జాబితా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
వీరమరణం పొందిన సైనికులు వీరే:
1. బిక్కుమళ్ల సంతోష్ బాబు - సూర్యాపేట, తెలంగాణ
2. నాథూరామ్ సోరెన్ - మయూర్ భంజ్, ఒడిస్సా
3. మనుదీప్ సింగ్- పాఠియాలా, పంజాబ్
4. సత్నాం సింగ్ - గుర్దాస్ పూర్, పంజాబ్
5. కె. పళని - మధురై, తమిళనాడు
6. సునీల్ కుమార్ - పాట్నా, బీహార్
7. బిపుల్ రాయ్ - మీరట్, ఉత్తర ప్రదేశ్
8. దీపక్ కుమార్ - రెవా, మధ్యప్రదేశ్
9. రాజేష్ ఓరాంగ్ - బిర్బం, పశ్చిమ బెంగాల్
10. కుందన్ కుమార్ ఓఝా - సహీబ్ గంజ్, ఝార్ఖండ్
11. గణేష్ రామ్ - కన్కేర్, ఛత్తీస్ ఘడ్
12. చంద్రకాంత ప్రదాన్ - కందామళ్, ఒడిస్సా
13. అంకుష్ - హమీర్ పుర్, హిమాచల్ ప్రదేశ్
14. గుర్బిందర్ - సంగ్రూర్, పంజాబ్
15. గుర్తేజ్ సింగ్ - మన్సా, పంజాబ్
16. చందన్ కుమార్ - భోజ్ పూర్, బీహార్
17. కుందన్ కుమార్- సహర్స, బీహార్
18. అమన్ కుమార్ - సంస్థిపూర్, బీహార్
19. జై కిషోర్ సింగ్- వైశాలి, బీహార్
20. గణేష్ హన్సదా - ఈస్ట్ సింగ్భూమ్, ఝార్ఖండ్
కాగా.. ఈ ఘర్షణలకు సంబంధించి భారత సైన్యం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారత, చైనా సైన్యాలకు సోమవారం రాత్రి, మంగళవారం ఘర్షణ జరిగిన గాల్వన్ ప్రాంతంలో ఇరువర్గాలూ వెనక్కి తగ్గాయని అందులో పేర్కొంది. ఈ ఘర్షణల్లో కర్నల్ సంతోష్ బాబు, ఇద్దరు సైనికులు (కె.పళని (తమిళనాడు), ఓఝా (ఝార్ఖండ్)) చనిపోయినట్టు తొలుత ప్రకటించిన ఆర్మీ.. తీవ్రంగా గాయపడిన మరో 17 మంది సైనికుల పరిస్థితి అక్కడి మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత వల్ల మరింత విషమించి, ప్రాణాలు కోల్పోయారని వ్లెలడించింది. దీంతో అమరులైన జవాన్ల సంఖ్య 20కి చేరినట్టు తెలిపింది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







