బీజింగ్ లో కరోనా..నిగ్గుతేల్చిన నార్వే

- June 17, 2020 , by Maagulf
బీజింగ్ లో కరోనా..నిగ్గుతేల్చిన నార్వే

ఓస్లో: చైనా రాజధాని బీజింగ్‌లో మళ్లీ కరోనా పడగ నీడలోకి వెళ్లిపోయింది. రాజధాని, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల 100 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన చైనా.. ఆయా ప్రాంతాల్లో విమానస్వీరసులను నిషేధించింది. సూళ్లకు కూడా సెలవులు ప్రకటించింది.

అయితే ప్రస్తుతం నమోదైన కేసులన్నిటీకీ కేంద్రం.. బీజింగ్‌లో ఉన్న ఓ మార్కెట్‌యే అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆ మార్కెట్ల నార్వే నుంచి దిగమతి చేసుకున్న సాల్మన్ రకం చేప కారణమనే వాదన తెరపైకి వచ్చింది. ఈ వార్త దావానలంలా వ్యాపిస్తుండటంతో చైనా, నార్వే దేశాలు రంగంలోకి దిగాయి. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు చర్చలు జరిపాయి. తాజాగా ఇవి ఓ కొల్లిక్కి రావడంతో చైనాలో తాజా కరోనా కల్లోలానికి నార్వే చేపలు కారణం కాదని తేల్చేశాయి. ఈ మేరకు నార్వే మత్స్య శాఖ మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com