తెలంగాణలో 352 కరోనా పాజిటివ్ కేసులు
- June 18, 2020
హైదరాబాద్:తెలంగాణలో గురువారం రికార్డు స్థాయిలో 352 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,027కి చేరింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. నేడు మరో ముగ్గురు కరోనాతో మృతిచెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 195గా నమోదైంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 3301 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2531 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఒక్క రోజే ఇంత భారీ మొత్తంలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజాగా నమోదైన కేసుల్లో కేవలం GHMC పరిధిలోనే 302 కేసులు ఉన్నాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన