తెలంగాణలో 352 కరోనా పాజిటివ్‌ కేసులు

- June 18, 2020 , by Maagulf
తెలంగాణలో 352 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో గురువారం రికార్డు స్థాయిలో 352 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,027కి చేరింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. నేడు మరో ముగ్గురు కరోనాతో మృతిచెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 195గా నమోదైంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 3301 మంది డిశ్చార్జి అయ్యారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 2531 కరోనా యాక్టివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఒక్క రోజే ఇంత భారీ మొత్తంలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజాగా నమోదైన కేసుల్లో కేవలం GHMC పరిధిలోనే 302 కేసులు ఉన్నాయి. 

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com