జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది..
- February 02, 2016జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్లకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. 150 డివిజన్లకు 1,333 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల కోసం 7,802 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 72లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్రెడ్డి తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. * జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి కుందన్బాగ్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కుందన్బాగ్లో పోలింగ్ ఏర్పాట్లను జనార్దన్రెడ్డి పరిశీలించారు. * రామ్నగర్లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. * మైలార్దేవరపల్లి డివిజన్లోని లక్ష్మీగూడ, కొండాపూర్ డివిజన్లోని 33,35,38 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో 15 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. * హైదరాబాద్ సీపీ మహేందర్రెడ్డి కుందన్బాగ్ చిన్మయ విద్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు