జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది..
- February 02, 2016
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్లకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. 150 డివిజన్లకు 1,333 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల కోసం 7,802 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 72లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్రెడ్డి తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. * జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి కుందన్బాగ్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కుందన్బాగ్లో పోలింగ్ ఏర్పాట్లను జనార్దన్రెడ్డి పరిశీలించారు. * రామ్నగర్లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. * మైలార్దేవరపల్లి డివిజన్లోని లక్ష్మీగూడ, కొండాపూర్ డివిజన్లోని 33,35,38 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో 15 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. * హైదరాబాద్ సీపీ మహేందర్రెడ్డి కుందన్బాగ్ చిన్మయ విద్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







