దుబాయ్:ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు
- June 21, 2020దుబాయ్:దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా భౌతిక దూరం పాటిస్తూ కొంతమంది ఔత్సాహికులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియన్ మిషన్ ఈ కార్యక్రమాన్ని తన సోషల్ మీడియా సైట్స్లో గంటసేపు ప్రత్యక్షప్రసారం చేసింది. ఈ సందర్భంగా దుబాయ్ లోని భారత కాన్సుల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ ప్రస్తుత కోవిడ్-19 విపత్కర పరిస్థితుల నుండి బయటకు రావడంలో యోగా ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. యూఏఈలోని వివిధ కమ్యూనిటీస్ ఈ సారి యోగా కార్యక్రమాన్ని వర్చువల్గా జరపడానికి ముందుకు వచ్చినట్లు విపుల్ పేర్కొన్నారు. ‘యోగా ఎట్ హోమ్ అండ్ యోగా విత్ ఫ్యామిలి’ పేరిట ఈ ఏడాది భారత ప్రధాని మోదీ పిలుపు మేరకు వర్చువల్గానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయించినట్లు ఆయన తెలియజేశారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు