ఏపీలో కొత్తగా 477 కేసులు
- June 21, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 477 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,929కి చేరింది. వైరస్బారినపడినవారిలో ఇప్పటివరకు 106 మంది మరణించగా, 4,307 మంది కోలుకున్నారు. మరో 4,516 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఐదుగురు మరణించారు. వీరిలో కృష్ణా జిల్లాకు చెందినవారు ముగ్గురు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కరు చొప్పున ఉన్నారు. ఈ రోజు నమోదైన కేసులో రాష్ర్టానికి సంబంధించి 439 కేసులు ఉండగా, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన 34 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన నలుగురు ఉన్నారు. అనంతపురం జిల్లాలో 11, చిత్తూరు జిల్లాలో 47, గుంటూరులో 26, తూర్పుగోదావరి 70, కడపలో 58, కృష్ణాలో 66, కర్నూలులో 47, నెల్లూరులో 12, ప్రకాశంలో 5, విశాఖపట్నంలో 39, విజయనగరంలో 6, పశ్చిమగోదావరిలో 52 కేసుల చొప్పున ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో ప్రకాశం జిల్లా ఒంగోలు, అనంతపురం జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ కొనసాగుతున్నది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!