ఏపీలో కొత్తగా 477 కేసులు

- June 21, 2020 , by Maagulf
ఏపీలో కొత్తగా 477 కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 477 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,929కి చేరింది. వైరస్‌బారినపడినవారిలో ఇప్పటివరకు 106 మంది మరణించగా, 4,307 మంది కోలుకున్నారు. మరో 4,516 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 

గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఐదుగురు మరణించారు. వీరిలో కృష్ణా జిల్లాకు చెందినవారు ముగ్గురు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కరు చొప్పున ఉన్నారు. ఈ రోజు నమోదైన కేసులో రాష్ర్టానికి సంబంధించి 439 కేసులు ఉండగా, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన 34 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన నలుగురు ఉన్నారు. అనంతపురం జిల్లాలో 11, చిత్తూరు జిల్లాలో 47, గుంటూరులో 26, తూర్పుగోదావరి 70, కడపలో 58, కృష్ణాలో 66, కర్నూలులో 47, నెల్లూరులో 12, ప్రకాశంలో 5, విశాఖపట్నంలో 39, విజయనగరంలో 6, పశ్చిమగోదావరిలో 52 కేసుల చొప్పున ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో ప్రకాశం జిల్లా ఒంగోలు, అనంతపురం జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. 

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com