తెలంగాణలో ఆదివారం ఒక్కరోజే 730 కరోనా కేసులు

- June 21, 2020 , by Maagulf
తెలంగాణలో ఆదివారం ఒక్కరోజే 730 కరోనా కేసులు

హైదరాబాద్:తెలంగాణలో ఆదివారం ఒక్కరోజే 730 కేసులు నమోదు కాగా ఏడుగురు మృతి చెందారు.  ఇక హైదరాబాద్‌లో అయితే కరోనా కేసులు బీభత్సంగా పెరిగిపోయాయి. GHMC పరిధిలో తాజాగా 659 కేసులు నమోదు అయ్యాయి. జనగామలో 34, మేడ్చల్‌లో 9, ఆసీఫాబాద్‌లో 3, సంగారెడ్డి, ఆదిలాబాద్, కొత్తగూడెం, నారాయణపేట, మెదక్, నల్గొండ, వికారాబాద్, వరంగల్, యాదాద్రిలో ఒక్కో పాజిటివ్ కేసు నమోదు అయింది. ఇప్పటివరకూ మొత్తం 7,802 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇంకా 3,861 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆదివారం 225 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 3,731 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా సోకి ఇప్పటివరకూ మొత్తం 210 మంది చనిపోయినట్లు  వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com