తెలంగాణలో 879 కరోనా కేసులు

- June 23, 2020 , by Maagulf
తెలంగాణలో 879 కరోనా కేసులు

హైదరాబాద్:తెలంగాణలో మంగళవారం కొత్తగా 879 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,553కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. నేడు కరోనా మరో ముగ్గురు మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 220గా నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 4,224 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 5,109 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా కేసుల్లో కేవలం GHMC పరిధిలోనే 652 ఉన్నాయి.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com