రియాద్:సౌదీ న్యాయశాఖలో 22 మందికి జడ్జీలుగా పదోన్నతులు..
- June 24, 2020
రియాద్:సౌదీలోని న్యాయశాఖలోని 22 మందికి న్యాయమూర్తులుగా పదోన్నతులు కల్పించారు కింగ్ సల్మాన్. ఈ మేరకు వారి నియామక ఆదేశాలకు సంబంధించి డిక్రీ జారీ చేశారు. జ్యూడిషియరీలోని వివిధ విభాగాల్లోని సమర్ధులు, నైపుణ్యం కలిగిన వారిని గుర్తించి పదోన్నతులు కల్పించినట్లు న్యాయవ్యవస్థ మండలి పరిపాలన విభాగం చైర్మన్ షేక్ ఖలీద్ బిన్ మొహ్మద్ అల్ యూసుఫ్ తెలిపారు. ప్రస్తత ఉత్తర్వులతో న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించే వారికి మరింత మెరుగైన సత్వర న్యాయం అందుతుందని అన్నారాయన. అంతేకాదు..సౌదీ న్యాయవ్యవస్థలో పలు సంస్కరణలు చేపడుతున్నట్లు వివరించారు. కక్షిదారులకు వీలైనంత త్వరగా పరిష్కారం అందించేందుకు వీలుగా న్యాయవ్యవస్థను డిజిటలైజ్ చేస్తున్నట్లు తెలిపారు. డిజిటలైజేషన్ ద్వారా పూర్తిగా పేపర్ వర్క్ తగ్గిపోయి..ఒకే సారి ఉత్తర్వులను అన్ని శాఖలకు పంపించేందుకు వీలు కలుగుతుందని..దీని ద్వారా ఎంతో సమయం ఆదా అవుతుందని వివరించారు. అంతేకాదు..డాక్యుమెంటేషన్ వర్క్ తగ్గి..ఏడాదికి 8 మిలియన్ల పేపర్లను ఆదా చేయవచ్చని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







