ట్రాఫిక్ ఉల్లంఘనలపై 'పాయింట్స్' కొరడా
- February 02, 2016
ట్రాఫిక్ జనరల్ డైరెక్టర్ షేక్ నాజర్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ ఖలీఫా, బహ్రెయిన్ డ్రైవింగ్ లెసెన్సులన్నిటికీ పాయింట్స్ సిస్టమ్ని వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 18 నుంచి ఈ పద్ధతి అమల్లోకి వస్తుంది. వాహనాల్ని నడిపేవారు రోడ్లపై బాధ్యతాయుతంగా వ్యవహరించేలా, ప్రమాదాలను తగ్గించేలా ఈ చర్య తీసుకున్నట్లు షేక్ నాజర్ చెప్పారు. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించిన విధానాన్ని బట్టి, పాయింట్స్ని లెక్కిస్తారనీ, వాటి ప్రకారం చర్యలు తీసుకోబడ్తుందనీ ట్రాఫిక్ డైరెక్టరేట్ వెల్లడించింది. ఏడాది లోపు డ్రైవింగ్ లెసెన్స్ ఇష్యూ చేయబడి ఉంటే, అన్ని సందర్భాల్లోనూ నిబంధనల ఉల్లంఘనకు డబుల్ పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. 20 పాయింట్లు దాటితే లైసెన్స్ ఆ ఏడాదికి రద్దు చేయబడుతుంది. తొలి ఉల్లంఘన నాటి నుంచి ఏడాదిపాటు ఈ రద్దు అమల్లో ఉంటుంది. ఒకవేళ ఏడాదిలో 20 పాయింట్ల ఉల్లంఘనకు పాల్పడకపోయినా, పాయింట్లు రద్దయిపోతాయి. తొలి నిబంధన నుంచి క్యాలెండర్ ఇయర్ ప్రారంభమవుతుంది. నిబంధనల్ని ఉల్లంఘించినవారికి ఆరు నెలల వరకు జైలుతోపాటు 50 నుంచి 500 బహ్రెయినీ దిర్హామ్ల ఫైన్ విధించబడుతుంది. లైసెన్స్ లేకపోతే రెండు పాయింట్లు, నిబంధనల్ని ఉల్లంఘించి పార్కింగ్ చేస్తే రెండు పాయింట్లు, ప్రమాదానికి కారణమై, ఆ ప్రమాదంలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది గాయపడితే మూడు పాయింట్లు, రాంగ్ ఓవర్టేకింగ్కి మూడు పాయింట్లు, నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోతే ఐదు పాయింట్లు, స్పీడ్ లిమిట్ దాటితే ఏడు పాయింట్లు ఆల్కహాల్, డ్రగ్స్ సేవించి వాహనం నడిపితే 8 పాయింట్లు, రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికి కారణమైతే 10 పాయింట్లు కౌంట్ చేయబడతాయి.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









