బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న రెండవ ఛార్టర్డ్ ఫ్లైట్

- June 27, 2020 , by Maagulf
బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న రెండవ ఛార్టర్డ్ ఫ్లైట్

మనామా:శంషాబాద్ విమానాశ్రయానికి కరోనా వేళ అంతర్జాతీయ విమానయాన సంస్థల చార్టర్డ్‌ ఫ్లైట్స్‌ వస్తున్నాయి. రెండవ ఛార్టర్డ్ ఫ్లైట్ బహ్రెయిన్ నుండి హైదరాబాద్ కు గత రాత్రి చేరుకుంది.వివరాల్లోకి వెళ్తే...మనామా నుండి  హైదరాబాద్ కు 282 మంది ప్రయాణికులతో విమానం గత రాత్రి శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంది.గల్ఫ్ ఎయిర్ వైస్ రెండవ విమానం తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో భారత రాయబార కార్యాలయం సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది.కరోనా కారణంగా బహ్రెయిన్ లో ఉపాధి కోల్పోయిన అనారోగ్య కారణాల వల్ల ఇబ్బంది పడుతున్న వారిని తెలంగాణకు తరలించడం జరిగింది.గత నెల రోజులుగా అవిశ్రాంత కృషి చేసిన తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో లో భారత రాయబార కార్యాలయం సహకారంతో విశేష కృషి చేసిన తెలుగు కళా సమితి హరి బాబు(అధ్యక్షులు),నోముల మురళి(ఉపాధ్యక్షులు),ఎం బి రెడ్డి(జనరల్ సెక్రెటరీ), రాజ్ కుమార్(ట్రెజరర్),వంశీధర్(కల్చరల్ సెక్రటరీ),రమేష్(స్పోర్ట్స్ సెక్రెటరీ), ఫణి  భూషణ్(మెంబర్షిప్ సెక్రెటరీ)  మరియు తెలుగు కళా సమితి కార్యవర్గ సభ్యులు.

--రాజేశ్వర్ (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com