ఏపీలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

- June 27, 2020 , by Maagulf
ఏపీలో  పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఏపీలో ఒక్కరోజులోనే 796 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందిన కేసులు 740 ఉన్నాయి. ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన పాజిటివ్ కేసులు 56 ఉన్నాయి.

తాజా కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12285కి చేరింది. కరోనా మహమ్మారి బారిన పడి ఒక్కరోజులోనే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 157 మంది మృతి చెందారు.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com